Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (11:44 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు దిగారు. కాకినాడ వేదికగా సాగుతున్న ఈ దీక్ష రైతు సమస్యల కోసం చేస్తున్నారు. ఈ దీక్ష పేరు రైతు సౌభాగ్య దీక్ష అని నామకరణం చేశారు. ఈ దీక్ష కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 
 
కాకినాడ నగరంలోని జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో పవన్ దీక్షకు కూర్చొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనేది పవన్ ప్రధాన డిమాండ్. పవన్ కళ్యాణ్ దీక్షలో ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, సినీ నటుడు నాగబాబులు కలిసి పాల్గొన్నారు.
 
"ఉభయ గోదావరి జిల్లాల ధాన్యం రైతుల గోడు ప్రభుత్వానికి వినిపించేలా, 'రైతు సౌభాగ్య దీక్ష' పేరుతో గురువారం కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రోజు నిరాహార దీక్ష. రైతుకు సంఘీభావం తెలుపుదాం, వారి కన్నీటిని తుడవడానికి ప్రయత్నిద్దాం!" అంటూ జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments