Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైర్డ్ ఐఏఎస్ అదికారి శర్మ లేఖకు స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ .. ఏంటా లేఖ?

వరుణ్
ఆదివారం, 14 జులై 2024 (19:45 IST)
రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ రాసిన లేఖపై జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ముడసర్లోవ పార్కును పరిరక్షించాలంటూ ఆయన కోరారు. ఆయన సూచనను పరిగణనలోకి తీసుకున్న పవన్.. ముడసర్లోవ అడవుల సంరక్షణపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 
 
పరిపాలనకు కొత్త అయిన పవన్ కళ్యాణ్... అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలో మాజీ రిటైర్డ్ అధికారి ఈఏఎస్ శర్మ ముడసర్లోవ అడవులపై లేఖ రాశారు. ముడసర్లో వద్ద జీవీఎంసీ నిర్మాణాలు పర్యావరణానికి హాని చేస్తాయని శర్మ తన లేఖ రాశారు. నిత్యం వందలాది మంది ప్రజలు సందర్శించే ముడసర్లోవ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని, జీవీఎంసీ ఆ పార్కులో భవనాల నిర్మాణానికి సిద్ధం అవుతుందని వచ్చిన వార్తలను ఉటంకిస్తూ ముడసర్లోవ పార్కును పరిరక్షించాలని శర్మ కోరారు. 
 
దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారుల నుంచి వివరణ కోరారు. ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేయొద్దని అధికారులను నిర్ధేశించారు. అయితే, ముడసర్లోవ వద్ద నిర్మాణాలేవీ చేపట్టడం లేదని, అలాంటి ప్రతిపాదనలు ఏవీ లేవని జీవీఎంసీ అధికారులు ఉప ముఖ్యమంత్రికి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

Vijay: దళపతి విజయ్ భారీ చిత్రం జన నాయగన్ వచ్చే సంక్రాంతికి విడుదల

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments