Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిపిన్ రావత్ సేవలు శ్లాఘనీయం : పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (21:21 IST)
దేశ తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణం పట్ల జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తన సంపాన్ని తెలుపుతూ, రావత్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఈ ప్రమాదంలో రావత్ దంపతులతో సహా 13 మంది సైనికాధికారులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. అలాగే, చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ మరణం కలిచివేసిందంటూ పవన్ కళ్యాణ్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 
 
అత్యున్నత సీడీఎస్ బాధ్యతలు అందుకున్న తొలి అధికారిగా బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం అని వివరించారు. త్రివిధ దళాలను సమన్వయ పరిచి దేశ రక్షణ వ్యవస్థలను పటిష్టపరిచే కీలక బాధ్యతల్లో ఉన్న రావత్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. 
 
హెలికాఫ్టర్ మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ కూడా ఉన్నారని తెలిసి చాలా బాధపడినట్టు గుర్తుచేశారు. మృతుల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments