Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై ఐదుగురు కామాంధుల సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (20:41 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. స్థానిక సుల్తాన్ బజార్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ బాలికపై ఆమె ప్రియుడితో పాటు అతని నలుగురు స్నేహితులు పలుమార్లు అత్యాచారం చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 30వ తేదీన సుల్తాన్ బజార్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైంది. దీనిపై ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ నెల 3వ తేదీన బాలికను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద విచారణ జరుపగా, తన స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. 
 
ఆ తర్వాత ఐదుగురు కలిసి మేడిపల్లి ప్రాంతంలో తనపై పలుమార్లు అత్యాచారం జరిపారని మైనర్ బాలిక బోరున విలపిస్తూ చెప్పింది. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments