Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ పోటీ చేసేది ఈ రెండు చోట్లే..

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (15:31 IST)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి స్థానాలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. భీమవరం (పశ్చిమ గోదావరి), గాజువాక(విశాఖ) నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. తాను పోటీ చేయబోతున్న స్థానాలపై గంట తర్వాత వివరాలు చెప్తానని పవన్ మంగళవారం ఉదయం ట్వీట్ ద్వారా తెలియజేసారు. 
 
ఆ తర్వాత విస్తృతంగా చర్చలు జరిపిన పార్టీ నాయకులు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పవన్ పోటీ చేసే స్థానాలను అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉండడం తమకు కలిసి వచ్చే అంశంగా వారు భావిస్తున్నారు. భీమవరంలో 2004 నుండి వరుసగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు.
 
గతంలో 2009 సాధారణ ఎన్నికల్లో పవన్ అన్న చిరంజీవి సైతం రెండు చోట్ల నుండి పోటీ చేసారు. సొంత జిల్లాలో ఓడిపోయిన చిరంజీవి, తిరుపతిలో విజయం సాధించారు. ప్రస్తుతం జరుగబోతున్న ఎన్నికల్లో పవన్ మూడు జాబితాల్లో 77 మంది అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా బీఎస్పీకి 21 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలను కేటాయించారు. సీపీఐ, సీపీఎంలకు ఏడేసి చొప్పున అసెంబ్లీ, రెండేసి లోక్‌సభ స్థానాలను కేటాయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments