Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొత్తు పొడిచింది : వస్తే జనసేన ప్రభుత్వం లేదా మిశ్రమ సర్కారు : పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (22:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. రణస్థలం వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వబోమన్నారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం చెందడం అవసరం లేదన్నారు. మన గౌరవం ఎక్కడా తగ్గకుండా ఉంటే సరిపోతుందన్నారు.
 
అలాగే, ఒంటరిగా అధికారం ఇస్తామని హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. మీరు భరోసా ఇస్తే ఖచ్చితంగా ఒంటరిగా ముందుకు వెళ్లి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అది సాధ్యం కాని పక్షంలో మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వస్తే జనసేన ప్రభుత్వం లేదంటే మిశ్రమ ప్రభుత్వం  ఏర్పాటు తథ్యమన్నారు. అలాగే, తాను త్వరలోనే వారాహి వాహనంపై రాష్ట్ర పర్యటనకు వస్తానని ఎవడ్రా ఆపేది.. దమ్ముంటే ముందుకు రండి అంటూ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments