Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ దోషులను శిక్షిస్తే అసెంబ్లీలో మాట్లాడారు, సుగాలి ప్రీతి గురించి మాట్లాడరేం? పవన్ ప్రశ్న

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (20:42 IST)
విద్యా సంస్థలో మైనర్ బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి హత్య చేస్తే వైసీపీ ప్రభుత్వం ఇంతవరకూ నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయింది, ఎందుకు శిక్షించలేకపోయిందంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ.... పోలీసులకు న్యాయం చేయాలనే వుంది. కానీ రాజకీయ బాసుల వల్ల ఆగిపోయారు. సినిమాల్లో 2 గంటల్లో న్యాయాన్ని చూపించవచ్చు. కానీ నిజ జీవితంలో ఎలా న్యాయం చేయాలని ఆలోచించా. 
 
సుగాలి ప్రీతికి న్యాయం జరగాలంటే దిశ హత్యాచారంపై ప్రజలు ఏవిధంగా రోడ్లెక్కారో అలాగే చేయాల్సిందే. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే. ఇక్కడ కర్నూలులో పలు రెసిడెన్షియల్ పాఠశాలలో బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. నిందితులను ఎన్‌కౌంటర్లు చేయమని చెప్పడంలేదు కానీ చట్టప్రకారం కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నాను. 
విద్యా సంస్థలో అత్యాచారం జరిగిందంటే ఇక బాలికలకు రక్షణ ఎక్కడ. సీబీఐ విచారణకు రాత పూర్వకంగా అప్పగించకపోతే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు కర్నూలులో జ్యుడియల్ క్యాపిటల్ పెట్టినా ప్రయోజనం శూన్యం. దిశ కోసం మాట్లాడినప్పుడు సుగాలి ప్రీతి గురించి జగన్ రెడ్డిగారు ఎందుకు మాట్లాడరు? సుగాలి ప్రీతికి న్యాయం జరిగితే నేను రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేదు" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments