Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ చేతిలో జగన్ టాటూ.. మండిపడుతున్న జనసైనికులు

పవన్ చేతిలో జగన్ టాటూ.. మండిపడుతున్న జనసైనికులు
, బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (12:38 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఫోటోలపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇందుకు కారణం ఓ టాటూ. జనసేనాని పవన్ కల్యాణ్ తన చేతిపై ఏపీ సీఎం టాటూను వేయించుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ మార్ఫింగ్ ఫొటోను కొందరు వదిలారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇటీవల కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ ఫొటోను కొందరు మార్ఫింగ్ చేశారు. ఎలాంటి టాటూ లేని పవన్ చేతిపై జగన్ ఫొటోను ఉంచారు. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు, జనసేన ట్విట్టర్ అకౌంట్‌కు కూడా ట్యాగ్ చేసారు. ఈ మార్ఫింగ్ ఫోటోపై జనసేన అభిమానులు మండిపడుతున్నారు.
 
ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలంటూ బిజీగా వున్నారు. తాజాగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో పింక్ సినిమా రీమేక్ మరో 15 రోజుల్లో పూర్తి కానుంది. ఈ సినిమాతో పాటే క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో క్రిష్ సినిమాకు సంబంధించి టైటిల్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. 
 
పాలమూరు పండుగ సాయన్న జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ దీనికి వీరూపాక్షి అనే డిఫెరెంట్ టైటిల్ వినిపిస్తుంది. ఇందులో పవన్ పాత్ర పేరు వీర. అందుకే ఈ సినిమాకు ఇలాంటి టైటిల్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం పవన్ చాలా కష్టపడుతున్నాడు. విజువల్‌గా కూడా చాలా రిచ్‌గా ఉండబోతుంది ఈ చిత్రం. దాదాపు 100 కోట్లతో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా చార్మినార్, తాజ్ మహల్ సెట్స్ కూడా నిర్మించారు. 2021లో సినిమా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెడ్ మీ నుంచి కొత్త ఫోన్.. వెనుక నుంచి రెండు కెమెరాలు