Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ముప్పు...

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (12:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నర్సాపురం - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై అడ్డుగా ఉన్న రైలు పట్టాలపై ముక్కను ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఇనుపముక్కం ఎగిరి పక్కన పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కావలి - బిట్రగుంట స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. ట్రాక్‌పై రైలు పట్టా ముక్కను ఎవరు పెట్టారన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఆదివారం తెల్లవారుజామున కావలి - బిట్రగుంట స్టేషన్ల మధ్యలో ముసునూరు వద్ద రైల్వే ట్రాక్‌పై దుండగులు రైలు పట్టాను పెట్టారు. దాదాపు రెండు మీటర్ల పొడవైన రైలు పట్టాను ట్రాక్‌కు అడ్డంగా పెట్టారు. అదే ట్రాక్‌పై నర్సాపూర్ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చింది.
 
రైలు పట్టాను ఢీ కొట్టగా.. ఆ వేగానికి రైలు పట్టా దూరంగా ఎగిరిపడింది. ఇలా ఎగిరి పక్కన పడడం వల్లే ప్రమాదం తప్పిందని, లేదంటే పెను ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పట్టాను ట్రాక్‌పై పెట్టిన దుండగులను పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments