Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నేత టీడీపీ టిక్కెట్ తెచ్చుకుంటే రాజకీయాలకు గుడ్‌బై :: పరిటాల శ్రీరామ్

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (13:04 IST)
వచ్చే ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ టిక్కెట్‌ను తెచ్చుకుంటానని ఓ నేత ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నాడనీ, నిజంగానే ఆయన తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ను తెచ్చుకుంటే మాత్రం తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ బహిరంగ సవాల్ విసిరారు. 
 
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని దుర్గా నగర్ టీడీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం అసెంబ్లీ టిక్కెట్‌ను తాను తెచ్చుకుంటానని ఓ నేత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగానే ఆయన టిక్కెట్ తెచ్చుకుంటే మాత్రం తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆ మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. 
 
ఇలా సొంత డబ్బా కొట్టుకునేవారి గురించి ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదేసమయంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments