Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరు 7 నుంచి పాపికొండల పర్యాటకం రెడీ

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (12:33 IST)
తూర్పుగోదావరి జిల్లా పాపికొండల పర్యాటకం మళ్లీ ప్రారంభం కానుంది. కచ్చులూరు బోటు ప్రమాదం జరిగిన రెండేళ్ల విరామానంతరం పాపికొండల పర్యాటకానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.

నవంబరు 7 నుంచి టూరిజం ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లి పోశమ్మగండి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కంట్రోలు రూంలో అన్ని అనుమతులతో 11 టూరిజం బోట్లను సిద్ధం చేశారు.

మొత్తం రెండు ప్రభుత్వ, 9 ప్రైవేటు బోట్లు సహా.. 11 టూరిజం బోట్లకు కాకినాడ పోర్టు అధికారులు తనిఖీలు నిర్వహించి ఫిట్‌నెస్‌ అనుమతులు ఇచ్చారు.

ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 26 మీటర్లుగా ఉందని, 30 మీటర్ల పరిధి వరకూ అనుమతులు ఇవ్వాల్సిందిగా ధవ ళేశ్వరం గోదావరి హెడ్‌ వర్క్స్‌ ఈఈని కోరినట్లు ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ డీఎం వీరనారాయణ తెలిపారు. గోదావరిలో రూట్‌ పర్మిషన్‌ ధవళేశ్వరం జలవనరుల శాఖ అధికారులు ఇప్పటికే ఇచ్చినట్లు తెలిపారు.
 
ఏపీ టూరిజం తరఫున లైఫ్‌ జాకెట్లు సేఫ్టీ మెజర్‌మెంట్‌ తీసుకుంటామని, టికెట్లు బుక్‌ చేసుకుంటే.. రాజమహేంద్రవరం నుంచి గండిపోశమ్మ ఆలయం వరకూ రోడ్డు మార్గాన టూరిస్టులను తీసుకువస్తామని తెలిపారు.

ఉదయం తొమ్మిది గంటలకు పాపికొండల విహార యాత్రకు బయలుదేరి, సాయంత్రం ఆరు గంటలకు తిరిగి గండి పోశమ్మ గుడివద్దకు చేరుకుంటామని వివరించారు. టికెట్‌ ధర ఒకరికి రూ.1,250 నిర్ణయించామని, టికెట్‌లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని తెలిపారు.

ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ తామే అందిస్తామని తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం ఒక ఎస్కార్ట్‌ బోటు ఏర్పాటు చేశామని, ప్రతి బోటుకూ సమాచారం అందే విధంగా శాటిలైట్‌ ఫోన్‌ ఉంటుందని, మరో ఫోన్‌ కంట్రోల్‌ రూం వద్ద ఉంటుందని చెప్పారు.

కంట్రోల్‌ రూం వద్ద రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది తనిఖీల అనంతరం దేవీపట్నం పోలీ్‌సస్టేషన్‌ వద్ద బోట్‌ను ఎస్‌ఐ తనిఖీ చేస్తారని తెలిపారు.

పాపికొండల పర్యటన ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలవరం మండలం కొరుటూరులో అటవీశాఖ నూతనంగా నిర్మించిన కాటేజీలు, ఐటీడీఏ ఆధ్వర్యంలోని కాటేజీలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments