Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరోసారి పెరిగిన చమురు ధరలు

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (12:30 IST)
దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దేశంలో పెట్రోల్​, డీజిల్​పై ధరల పెంపు కొనసాగుతోంది. 
 
తాజాగా లీటర్​కు 35 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.108.99కు చేరగా.. డీజిల్​ ధర రూ.97.73కు పెరిగింది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 33 పైసలు పెరిగి రూ.114.77కు చేరగా.. లీటర్​ డీజిల్ 38 పైసలు పెరిగి​​ రూ.105.83 వద్ద కొనసాగుతోంది.
 
కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర 34 పైసలు పెరిగి రూ.109.42గా ఉంది. లీటర్​ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.100.80 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరిగి రూ.105.70 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర 33 పైసలు రూ.101.88కు చేరింది.
 
హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.113.32కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.106.56 కి చేరింది. గుంటూరులో పెట్రోల్ ధర లీటర్​కు రూ.115.30కి చేరింది.

డీజిల్​పై 36 పైసలు పెరిగి​ లీటర్ రూ.107.92 వద్ద కొనసాగుతోంది.  వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.03 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.106.69కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments