Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా అధినేత జగన్‌కు షాకిచ్చిన విశాఖ నేత - పార్టీకి గుడ్‌బై

Webdunia
గురువారం, 13 జులై 2023 (13:01 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా నేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేత ఒకరు తేరుకోలేని షాకిచ్చారు. ఈయన విశాఖపట్టణం జిల్లా వైకాపా అధ్యక్షుడుగా ఉన్నారు. పేరు పంచకర్ల రమేష్ బాబు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. వైజాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా విషయాన్ని ఆయన బహిర్గతం చేశారు. 
 
పెందుర్తి నియోజకవర్గంలో గత కొంతకాలంగా వైకాపా నేతల మధ్య వర్గ పోరు నడుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ టిక్కెట్ కోసం ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకర్ల రమేష్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అదేసమయంలో పెందుర్తిలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై పంచకర్ల పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. 
 
దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత యేడాది కాలంగా అనేక సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ అందుకు వీలు కాకుండా పోయిందన్నారు. కింది స్థాయిలో సమస్యలు తీర్చలేనపుడు పదవిలో ఉండి లాభమేంటని ప్రశ్నించారు. ఫెయిల్యూర్ లీడర్‌గా ఉండేందుకు తాను సిద్ధంగా లేనని అందుకే రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments