వైకాపా అధినేత జగన్‌కు షాకిచ్చిన విశాఖ నేత - పార్టీకి గుడ్‌బై

Webdunia
గురువారం, 13 జులై 2023 (13:01 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా నేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేత ఒకరు తేరుకోలేని షాకిచ్చారు. ఈయన విశాఖపట్టణం జిల్లా వైకాపా అధ్యక్షుడుగా ఉన్నారు. పేరు పంచకర్ల రమేష్ బాబు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. వైజాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా విషయాన్ని ఆయన బహిర్గతం చేశారు. 
 
పెందుర్తి నియోజకవర్గంలో గత కొంతకాలంగా వైకాపా నేతల మధ్య వర్గ పోరు నడుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ టిక్కెట్ కోసం ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకర్ల రమేష్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అదేసమయంలో పెందుర్తిలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై పంచకర్ల పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. 
 
దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత యేడాది కాలంగా అనేక సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ అందుకు వీలు కాకుండా పోయిందన్నారు. కింది స్థాయిలో సమస్యలు తీర్చలేనపుడు పదవిలో ఉండి లాభమేంటని ప్రశ్నించారు. ఫెయిల్యూర్ లీడర్‌గా ఉండేందుకు తాను సిద్ధంగా లేనని అందుకే రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments