Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుకొట్టి చిందేసిన ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసు

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (11:38 IST)
వైకాపా నేతలతో కలిసి మందేసి చిందేసిన ఎమ్మార్వోకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తేరుకోలేని షాకిచ్చారు. వైకాపా నేతల మందు పార్టీలో పాల్గొన్నందుకుగాను వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసును జారీచేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వోగా నరసింహమూర్తి ఉన్నారు. ఇటీవల వైకాపా నేతలంతా కలిసి ఓ తోటలో పెట్టుకున్న మందుపార్టీలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఈయనతో పాటు ఉద్యోగులతో మందు పార్టీ చేసుకుని ఆ తర్వాత వైసీపీ నేతలతో కలసి డ్యాన్స్ చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో నరసింహమూర్తికి పాలకొండ ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన శాఖాపరమైన విచారణ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments