Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా వెంకయ్య మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి: సోమిరెడ్డి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (12:09 IST)
ఉపరాష్ట్రపతిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న శ్రీ వెంకయ్య నాయుడు గారికి తెదేపా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా తెలుపుతూ.. సింహపురి నుంచి హస్తినాపురి వరకు సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం వెంకయ్య అన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... అమ్మభాష పరిరక్షణకు అవిశ్రాంత పోరాటం.. ప్రజాస్వామ్య బలోపేతానికి నిరంతర కృషి.. కరోనా సంక్షోభ సమయంలో జాతిని ఉత్తేజం చేసేందుకు ప్రత్యేక ప్రయత్నాలతో భారతమాత ముద్దుబిడ్డగా నాలుగేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న గౌరవ ఉపరాష్ట్రపతి, పూజ్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
 
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా పెద్దాయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని మనసారా కోరుకుంటున్నాను అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments