Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలి- టీడీపీ సభ్యులు

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్‌లో పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని టిడిపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఆర్టీసి టికెట్ ధరలు పెంచడంతో ప్రజలపై 1000కోట్ల రూపాయలు భారం పడుతోందని కావున పెంచిన ధరలను వెంటనే రుద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
దానిపై రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు మరియు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ జోక్యం చేసుకుని ఆర్టీసీ చార్జీలు పెంచడానికి గల కారణాలు పై సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కావున సభ్యులు నిరసన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఆర్టీసీ చార్జీలు పెంచడానికి కారణాలతో పాటు ఆర్టీసీని అప్పుల్లో కి నెట్టిన వారెవరూ కూడా వివరంగా చర్చిద్దామని అన్నారు.
 
ముందుగా పెంచిన చార్జీలు తగ్గించాలని ఆతర్వాత ఆర్టీసీకి సంబంధించిన అంశాలు చర్చిద్దామని టిడిపి సభ్యులు పట్టుబట్టి వారి నిరసనను కొనసాగించారు. ఈ దేశంలో శాసన మండలి అధ్యక్షులు మహ్మద్ అహ్మద్ షరీఫ్ జోక్యం చేసుకుని సభా సాంప్రదాయాలు పాటిస్తూ వెంటనే సభ్యులు నిరసన విరమించాలని విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ టిడిపి సభ్యులు నిరసనను కొనసాగించడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments