Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిపక్షనేత చంద్రబాబు స్థలం కబ్జా చేసారు, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (19:39 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కబ్జాకోరులు రెచ్చిపోతున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలు, వారి అండతోనే కబ్జా యదేచ్ఛగా సాగిపోతుందంటుని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్థలాన్నే కబ్జా చేసేశారట.


చిత్తూరు జిల్లాలోని చంద్రబాబునాయుడు సొంత గ్రామం నారావారిపల్లిలో సర్వేనెంబర్ 222/5లో చంద్రబాబు పేరుతో 38 సెంట్ల భూమి ఉంది. చంద్రబాబు స్థలంలో కబ్జాకోరులు రాళ్ళను నాటి స్థలం మొత్తాన్ని కబ్జా చేయాలని ప్రయత్నించారు. 1989 సంవత్సరంలో 87 సెంట్ల రిజిస్టర్ భూమిని చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు కొనుగోలు చేశారు.

 
అయితే ఆ తరువాత ఆ భూమి చంద్రబాబు పేరిట వచ్చింది. ఆ భూమిలో కొంత భాగాన్ని ప్రజల అవసరాల కోసం కళ్యాణ మండపం, ఆసుపత్రి నిర్మాణానికి ఇచ్చారు చంద్రబాబు. మిగిలిన 38 సెంట్ల భూమి అలాగే ఉంది. అయితే నిన్న రాత్రి కొంతమంది ఆ స్థలాన్ని చదును చేసి కబ్జా చేసేశారు. దీంతో చంద్రబాబు బంధువులు... పోలీసులు, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా ఎవరూ కూడా అటువైపుగా రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments