Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిపక్షనేత చంద్రబాబు స్థలం కబ్జా చేసారు, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (19:39 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కబ్జాకోరులు రెచ్చిపోతున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలు, వారి అండతోనే కబ్జా యదేచ్ఛగా సాగిపోతుందంటుని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్థలాన్నే కబ్జా చేసేశారట.


చిత్తూరు జిల్లాలోని చంద్రబాబునాయుడు సొంత గ్రామం నారావారిపల్లిలో సర్వేనెంబర్ 222/5లో చంద్రబాబు పేరుతో 38 సెంట్ల భూమి ఉంది. చంద్రబాబు స్థలంలో కబ్జాకోరులు రాళ్ళను నాటి స్థలం మొత్తాన్ని కబ్జా చేయాలని ప్రయత్నించారు. 1989 సంవత్సరంలో 87 సెంట్ల రిజిస్టర్ భూమిని చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు కొనుగోలు చేశారు.

 
అయితే ఆ తరువాత ఆ భూమి చంద్రబాబు పేరిట వచ్చింది. ఆ భూమిలో కొంత భాగాన్ని ప్రజల అవసరాల కోసం కళ్యాణ మండపం, ఆసుపత్రి నిర్మాణానికి ఇచ్చారు చంద్రబాబు. మిగిలిన 38 సెంట్ల భూమి అలాగే ఉంది. అయితే నిన్న రాత్రి కొంతమంది ఆ స్థలాన్ని చదును చేసి కబ్జా చేసేశారు. దీంతో చంద్రబాబు బంధువులు... పోలీసులు, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా ఎవరూ కూడా అటువైపుగా రాలేదు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments