Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు తేలనున్న తెదేపా మాజీ మంత్రి గంటా భవితవ్యం

Advertiesment
నేడు తేలనున్న తెదేపా మాజీ మంత్రి గంటా భవితవ్యం
, శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (07:51 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఆయనకు పార్టీ అధినేత నుంచి పిలుపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఇన్‌ఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలకు ఈ కబురు వెళ్లింది. శుక్రవారం జరిగే కీలక భేటీలో మొత్తం 12 మందికి ఆహ్వానం వెళ్లింది. 
 
కబురు పంపిన వారిలో సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు కూడా ఉన్నారు. నిజానికి ఈయన గత 2019 ఎన్నికల తర్వాత పార్టీలో క్రియాశీలకంగా లేరు. ఒకసారి వైకాపాలో మరోమారు బీజేపీలో చేరబోతున్నట్టు ముమ్మరంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని ఆయన ఏ రోజూ ఖండించకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. 
 
ఆ తర్వాత విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించే సమావేశానికి గంటాతో పాటు 12 మందిని ఆహ్వానించారు. ఈ సమావేశానికి గంటా వస్తారా? లేదా? అన్నది తేలిపోతుంది. ఒకవేళ వస్తే ఆయన టీడీపీలోనే కొనసాగే అవకాశం వుంది. లేనిపక్షంలో ఆయన పార్టీ మారడం ఖాయమని తేలిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ - చైనాల మధ్య యాప్‌ల నిషేధం వార్