Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన.. 38 ఎక‌రాల్లో గంజాయి ధ్వంసం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (10:57 IST)
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా భారీగా గంజాయి తోట‌లను పోలీసులు ధ్వంసం చేశారు. 38 ఎకరాల్లో ర‌హ‌స్యంగా పండిస్తున్న గంజాయి తోటలు ధ్వంసం చేశారు. గూడెం కొత్తవీధి మండలం, దేవరపల్లి పంచాయతీకి చెందిన కుంకుమపూడి, చేరుకంపాకలు,  భూసులు గ్రామాలలో 38 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

 
జిల్లా ఎస్పీ  బి.కృష్ణారావు ఐపిఎస్., ఎస్.ఈ.బి, జె.డి ఎస్.సతీష్ కుమార్, ఆదేశాలు మేరకు ఎస్.ఈ.బి., ఇతర శాఖల సమన్వయంతో పోలీస్ సిబ్బంది గంజాయి తోటల ధ్వంసంలో పాల్గొన్నారు. గంజాయికి కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌యారైంద‌ని ఇటీవ‌ల ప్ర‌తిప‌క్షాలు ఆరోపించ‌డం, దీన్ని రాజకీయం చేయ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న ప్రారంభించారు.


దండులు దండులుగా విశాఖ ఏజెన్సీలో తిరుగుతూ, గంజాయి పండిస్తున్న ప్రాంతాల‌ను గుర్తిస్తున్నారు. దీనికి స్థానిక రైతుల స‌హకారాన్ని అర్థిస్తున్నారు. గంజాయి వేసిన వారి వివ‌రాలు తీసుకుని, వారినే పంట‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్ళి స్వ‌యంగా పంట‌ను ధ్వంసం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments