Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన.. 38 ఎక‌రాల్లో గంజాయి ధ్వంసం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (10:57 IST)
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా భారీగా గంజాయి తోట‌లను పోలీసులు ధ్వంసం చేశారు. 38 ఎకరాల్లో ర‌హ‌స్యంగా పండిస్తున్న గంజాయి తోటలు ధ్వంసం చేశారు. గూడెం కొత్తవీధి మండలం, దేవరపల్లి పంచాయతీకి చెందిన కుంకుమపూడి, చేరుకంపాకలు,  భూసులు గ్రామాలలో 38 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

 
జిల్లా ఎస్పీ  బి.కృష్ణారావు ఐపిఎస్., ఎస్.ఈ.బి, జె.డి ఎస్.సతీష్ కుమార్, ఆదేశాలు మేరకు ఎస్.ఈ.బి., ఇతర శాఖల సమన్వయంతో పోలీస్ సిబ్బంది గంజాయి తోటల ధ్వంసంలో పాల్గొన్నారు. గంజాయికి కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌యారైంద‌ని ఇటీవ‌ల ప్ర‌తిప‌క్షాలు ఆరోపించ‌డం, దీన్ని రాజకీయం చేయ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న ప్రారంభించారు.


దండులు దండులుగా విశాఖ ఏజెన్సీలో తిరుగుతూ, గంజాయి పండిస్తున్న ప్రాంతాల‌ను గుర్తిస్తున్నారు. దీనికి స్థానిక రైతుల స‌హకారాన్ని అర్థిస్తున్నారు. గంజాయి వేసిన వారి వివ‌రాలు తీసుకుని, వారినే పంట‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్ళి స్వ‌యంగా పంట‌ను ధ్వంసం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments