Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు చెట్టుకు చేటు చేసే పొగమల్లెలా మారిన జగన్ బంధువు... ఎవరు?

ఒంగోలు మాజీ ఎంపీ, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకి చెందిన వరికూటి అశోక్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రాత్రి కొండపిలోని సాయి సీతారామ కల్యాణ మండపంలో జరిగిన వరికూటి అనుకూల వర

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (15:54 IST)
ఒంగోలు మాజీ ఎంపీ, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకి చెందిన వరికూటి అశోక్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రాత్రి కొండపిలోని సాయి సీతారామ కల్యాణ మండపంలో జరిగిన వరికూటి అనుకూల వర్గీయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భాషలో చెప్పాలంటే పొగాకు చెట్టుకు చేటు చేసే పొగమల్లెలా వైవీ సుబ్బారెడ్డి తయారయ్యారంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.
 
ప్రకాశం జిల్లాలో వైకాపా అనేదిలేకుండా చేయడానికి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా ఉన్న అస్తులు కరిగిపోయాయి... ఇప్పుడు మీకు నేను నాయకుడిగా పనికిరాలేదా... మీకు బానిసలు కావాలని ఇన్‌చార్జి పదవి వేరొకరికి ఇస్తారా? ఇది సమంజసమా? అంటూ నిలదీశారు. 
 
ముఖ్యంగా, అప్పుతెచ్చానో? ఉన్నదే కాజేసుకున్నానో నాలుగు కోట్లు పార్టీ కోసం వెచ్చించాను అంటూ వాపోయారు. దళితుల రక్తమాంసాల మీద ఎంపీ కోట కట్టుకుంటారా? ఒక్క దళితులకే కాదు, బీసీలకు అన్యాయం చేస్తావా? అంటూ వైవీనిని అశోక్ బాబు దునుమాడారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments