Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతాం: సీఆర్పీఎఫ్

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (13:03 IST)
కేంద్ర ప్రభుత్వం   మార్గదర్శకాల ప్రకారం  దేశ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని సిఆర్పిఎఫ్ నిర్ణయించినట్లు రాజమహేంద్రవరం, లాలా చెరువు లోని సీ.ఆర్. పి.ఎఫ్ 42 బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రెండు వేల మొక్కలు నాటుతున్న ట్లు  సతీష్ కుమార్ తెలిపారు.

గురువారం రాజమహేంద్రవరం లోని ఆవ రోడ్డు లో ఉన్న వాంబే గృహాల లో సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సిబ్బంది 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీ.ఆర్. పి.ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్  మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం ఈ ఏడాది అంతా నిరంతరం  కొనసాగుతుందని తెలిపారు. ఈఏడాది ఆఖరు నాటికి సీ.ఆర్. పి.ఎఫ్ 42 బెటాలియన్ తరపున 10,000 మొక్కలు నాటు తామని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే విధానాన్ని తమ  జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు.  మొక్కలు నాటి వాటిని సంరక్షించి,  పెంచినట్లైతే  పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అకాడమీ డి డి ఎం. వి ప్రసాద్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ డి.ఈ  ప్రసాద్, సిల్వి కల్చరిస్ట్ ఎల్.భీమయ్య,  సీలేరు, డొంకరాయి, చింతూరు, సిఆర్పిఎఫ్ బెటాలియన్. అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments