Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతాం: సీఆర్పీఎఫ్

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (13:03 IST)
కేంద్ర ప్రభుత్వం   మార్గదర్శకాల ప్రకారం  దేశ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని సిఆర్పిఎఫ్ నిర్ణయించినట్లు రాజమహేంద్రవరం, లాలా చెరువు లోని సీ.ఆర్. పి.ఎఫ్ 42 బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రెండు వేల మొక్కలు నాటుతున్న ట్లు  సతీష్ కుమార్ తెలిపారు.

గురువారం రాజమహేంద్రవరం లోని ఆవ రోడ్డు లో ఉన్న వాంబే గృహాల లో సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సిబ్బంది 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీ.ఆర్. పి.ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్  మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం ఈ ఏడాది అంతా నిరంతరం  కొనసాగుతుందని తెలిపారు. ఈఏడాది ఆఖరు నాటికి సీ.ఆర్. పి.ఎఫ్ 42 బెటాలియన్ తరపున 10,000 మొక్కలు నాటు తామని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే విధానాన్ని తమ  జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు.  మొక్కలు నాటి వాటిని సంరక్షించి,  పెంచినట్లైతే  పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అకాడమీ డి డి ఎం. వి ప్రసాద్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ డి.ఈ  ప్రసాద్, సిల్వి కల్చరిస్ట్ ఎల్.భీమయ్య,  సీలేరు, డొంకరాయి, చింతూరు, సిఆర్పిఎఫ్ బెటాలియన్. అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments