Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలు జారింది.. అంతే ఆ వృద్ధ దంపతులు మృతి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (16:07 IST)
కాలు జారింది.. అంతే ఆ వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. వృద్ధాప్యంలో కూడా ఒకరిపై ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడి ఎంతో ధైర్యంగా బతుకుతున్న వృద్ధ దంపతుల పట్టుదలను చూసి విధి ఓర్వలేక పోయింది. చివరికి నీటి ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటి గుంతలో పడి వృద్ధ భార్యాభర్తలిద్దరూ మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇట్నేవారి పల్లె గ్రామానికి సమీపంలో ఉన్న వేరుశనగ పంటకు కాపలాగా ఉన్నారు వృద్ధ దంపతులు నారాయణ వెంకట రామనమ్మ . వేరుశనగ పంటకి దగ్గరలో ఒక నీటి గుంట ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరు వృద్ధ దంపతులు బట్టలు ఉతికేందుకు నీటి గుంట దగ్గరికి వెళ్ళారు.
 
ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలుజారి ఇద్దరు దంపతులు నీటి గుంటలో పడిపోయారు. చివరికి ఎవరు అటువైపుగా గమనించక పోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments