కరోనా క్వారంటైన్ సెంటర్‌లలోనూ మహిళలను వదలని కామాంధులు

Webdunia
గురువారం, 21 మే 2020 (20:53 IST)
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రజలు అల్లాడుతున్నారు. కరోనా సోకి హాస్పిటల్‌లలో క్వారంటైన్ కోసం చేరిన వారికి కామంతో కళ్లుమూసుకుపోయాయి. వివరాలలోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న మహిళను కొంతమంది దుర్మార్గులు వేధింపులకు గురిచేసారు. కరోనా పాజిటివ్ రోగితో కాంటాక్ట్ నేపథ్యంలో కుమేరియా భటోలి గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో అధికారులు ఓ మహిళను క్వారంటైన్‌లో ఉంచారు.
 
ఆమెపై కన్నేసిన ఇద్దరు కామాంధులు, ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను చూపించి, సదరు మహిళను లైంగికంగా వేధించారు. అంతటితో ఆగకుండా, ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే ఈ వీడియోని సామాజిక మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. సదరు మహిళ భయంతో పోలీసులను ఆశ్రయించింది. 
 
పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు, అయితే అప్పటికే ఆ కామాంధులు వారి వద్ద ఉన్న వీడియోను డిలీట్ చేయడంతో, పోలీసులు మహిళ దగ్గర ఉన్న వీడియో ఆధారంగా, బాధితురాలికి వారు పంపిన సందేశాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసారు. క్వారంటైన్ సెంటర్‌లో సైతం మహిళను లైంగికంగా వేధించడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం