వరంగల్‌లో నలుగురు వలస కార్మికుల ఆత్మహత్య

Webdunia
గురువారం, 21 మే 2020 (20:52 IST)
వరంగల్ జిల్లాలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. నలుగురు వలస కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో పాటు.. పూట గడవడం కూడా కష్టమైంది. దీంతో దిక్కుతోచక వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
స్థానికుల సమాచారం మేరకు... వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన చిన్నారితో పాటు.. నలుగురు కుటుంబ సభ్యులు వరంగల్‌ జిల్లా గిర్సుకొండ మండలం, గొర్రెకుంట గ్రామంలో నివసిస్తూ కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, లాక్డౌన్ కారణంగా వారు గత 60 రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. ఉపాధి కోల్పోవడంతో పూటగడవడం కష్టమైంది. దీనికితోడు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వలస కార్మికులు ఇదే తరహా సమస్యను ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama Parameswaran: క్రేజీ కల్యాణం నుంచి అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్

Suhas: నా ముందే ఒకాయన సెట్‌లో ఇతన్నెందుకు పిలిచారు అన్నాడు: సుహాస్‌

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments