Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌లో నలుగురు వలస కార్మికుల ఆత్మహత్య

Webdunia
గురువారం, 21 మే 2020 (20:52 IST)
వరంగల్ జిల్లాలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. నలుగురు వలస కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో పాటు.. పూట గడవడం కూడా కష్టమైంది. దీంతో దిక్కుతోచక వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
స్థానికుల సమాచారం మేరకు... వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన చిన్నారితో పాటు.. నలుగురు కుటుంబ సభ్యులు వరంగల్‌ జిల్లా గిర్సుకొండ మండలం, గొర్రెకుంట గ్రామంలో నివసిస్తూ కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, లాక్డౌన్ కారణంగా వారు గత 60 రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. ఉపాధి కోల్పోవడంతో పూటగడవడం కష్టమైంది. దీనికితోడు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వలస కార్మికులు ఇదే తరహా సమస్యను ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments