Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సేఫ్.. ఆందోళన వద్దు - ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా

Webdunia
శనివారం, 11 జులై 2020 (18:00 IST)
కరోనాకు ప్రముఖులు కూడా భయపడిపోతున్నారు. ప్రజాప్రతినిధులను కరోనా తాకుతున్న పరిస్థితుల్లో వారంతా అప్రమత్తంగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రముఖల దగ్గర పనిచేసే వారికి ముందుగా కరోనావైరస్ సోకింది. వారి ద్వారా కాంటాక్ట్ పద్థతిన కరోనా వస్తోంది. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
 
దీంతో రోజాకు కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై రోజా స్పందించారు. తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని.. ఎవరూ ఆందోళనకు గురికావద్దని చెప్పారు. తాను ఇంట్లో చాలా సేఫ్‌గా ఉన్నానని.. వైసిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావద్దంటున్నారు రోజా. 
 
తన వ్యక్తిగత గన్‌మెన్‌ను తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రికి తరలించామని.. ప్రస్తుతం అతనికి ఆ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని.. కరోనా లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలని కూడా రోజా కోరుతోంది. అలాగే ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మేనల్లుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో నారాయణస్వామి కూడా హోం ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments