కాంట్రాక్టర్లను బెందిరించిన వైఎస్ కొండారెడ్డి జిల్లా బహిష్కరణ

Webdunia
గురువారం, 12 మే 2022 (07:38 IST)
ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్లను బెదిరించిన కేసులో అరెస్టు అయి ఆ తర్వాత బెయిలుపై విడుదలైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు వైఎస్. కొండారెడ్డి జిల్లా బహిష్కరణ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టరుకు సిఫార్సు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
చక్రాయపేట మండలం నాలుగులేన్ల రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న ఎస్.ఆర్.కె కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉద్యోగులను బెందిరించడమే కాకుండా, రూ.5 కోట్ల డబ్బులు డిమాండ్ చేసినందుకు కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
అయితే, ఆయనపై ఈ తరహా కేసులు అనేకం ఉండటంతో ఆయన్ను జిల్లా నుంచి బహిష్కరించేందుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. జిల్లాలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, అవినీతి అక్రమాలకు పాల్పడినా వెంటనే అవినీతి నిరోధక శాఖ ఫోన్ 14400 లేదా 100 లేదా తన ఫోన్ నంబరు 94407 96900కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments