Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్ బెంగతో పెళ్లి కొడుకు ఆత్మహత్య .. ఎక్కడ?

Webdunia
గురువారం, 12 మే 2022 (07:20 IST)
విశాఖపట్టం జిల్లా మల్కాపురంలో మరికొన్ని గంటల్లో పెళ్ళిపీటలెక్కాల్సిన పెళ్ళి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భవిష్యత్ బెంగతోనే తాను బలవన్మరణానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో రాశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖ నగరం మల్కాపురం ప్రాంతంలోని జై ఆంధ్రా కాలనీకి చెందిన పాటి దినేష్ (25) అనే యువకుడు హెచ్.పి.సి.ఎల్‌లో కాంట్రాక్టు కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఆయనకు పెందుర్తి సమీపంలోని పెదగాడి ప్రాంతానికి చెందిన ఓ యువతితో నిశ్చితార్థమైంది. వీరిద్దరికి పెళ్లి బుధవారం రాత్రి 10.15 గంటలకు జరగాల్సివుంది. ఇందుకోసం మంగళవారం దినేశ్‌ను పెళ్ళి కుమారుడిని చేసి పెళ్లికి వచ్చిన బంధువులంతా సరదాగా గడిపారు. 
 
ఆ తర్వాత వేకువజామున మిద్దెపైకి వెళ్ళిన వరుడు చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దినేశ్ రాసినట్టుగా భావిస్తున్న సూసైడ్ నోట్ లభ్యమైంది. ఇందులో తనను ఇంట్లో చిత్ర హింసలు పెడుతున్నారని, కంపెనీలో పనికి వెళితే కాంట్రాక్టర్ అతని సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని, భవిష్యత్ బెంగతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీంతో భాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట చావుడప్పులు మోగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments