Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ లేదని నర్సు డెలీవరీ చేసింది.. అంతే పసికందు ప్రాణాలు?

Webdunia
శనివారం, 11 మే 2019 (10:49 IST)
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యమైన సంఘటనను మరువక ముందే మరో శిశువు ప్రాణాలు కోల్పోయింది. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి శిశువుకు పచ్చకామెర్లు వచ్చాయని తల్లిదండ్రులు తీసుకెళ్తే.. శిశువు అదృశ్యమైన ఘటన గురించి తెలిసిందే.


ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల పాటు చిన్నారిని మోసిన ఆ తల్లికి ఆసుపత్రి సిబ్బంది కడుపుకోతను మిగిల్చారు. డాక్టర్ లేకపోవడంతో నార్మల్ డెలివరీ చేయించబోయారు. అయితే ఈ వైద్యం వికటించి పిల్లాడు పురిట్లోనే మృతి చెందిన ఘటన తెలంగాణలోని నిజామాబాద్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రేణుక అనే మహిళ మూడో కాన్పు కోసం చేరింది. నొప్పులు రావడంతో డాక్టర్‌ని పిలిచారు. కానీ డాక్టర్ అంబికా రెండ్రోజులుగా అందుబాటులో లేకపోవడంతో నర్సు జ్యోతి తాను డెలివరీ చేయిస్తానని చెప్పింది. అనంతరం నార్మల్ డెలివరీ పూర్తయ్యాక కొద్దిసేపటికే బాలుడు మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని జ్యోతి దాచిపెట్టింది. చిన్నారి ఆరోగ్యం బాగోలేదనీ, పక్కనే ఉన్న మెట్ పల్లిలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించింది.
 
బాబును మెట్ పల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే బాలుడు చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. డెలివరీ సందర్భంగా జరిగిన పొరపాటు కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని తేల్చిచెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments