Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (19:30 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 13 ప్రదేశాల్లో సోదాలు చేశారు. ఇళ్లలో ఉన్న సెల్‌ఫోన్స్‌, పుస్తకాలు, హార్డ్ డిస్క్‌లు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

అల్వాల్, నాగోల్, నారాయణగూడ, బాగ్‌లింగంపల్లిలో సోదాలు కొనసాగుతున్నాయి. బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కాలేజ్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేశారు.

అపార్ట్‌మెంట్‌లో ఓయూ విద్యార్థులు ఉంటున్నారని సమాచారంతో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో నిషేధిత సాహిత్య పుస్తకాలు ఉన్నట్లు గుర్తించారు. నారాయణగూడలోని అంబికా టవర్స్‌లో లేడీస్ హాస్టల్‌లోనూ సోదాలు చేశారు.

నాగోల్‌లో రవిశర్మ ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఆయన మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి లొంగిపోయారు. ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.

అల్వాల్ సుభాష్ నగర్‌లో నివాసముంటున్న.. అమరుల బంధుమిత్రుల సంఘం నేత పద్మ కుమారి, భవాని ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. పద్మను పోలీసులు విచారిస్తుండగా స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో పుస్తకాలు, వస్తువులను పోలీసులు చిందరవందరగా పడేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments