Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు: రేవంత్‌రెడ్డి

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (19:24 IST)
తెలంగాలోని రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని.. ఇద్దరూ కలిసి రైతులను నట్టేట ముంచడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ రౌడీ సినిమాలోని ఓ సీన్ గురించి రేవంత్ వివరించారు.

ఆ సినిమాలో విలన్ మనుషులు రోడ్డు మీదకు వచ్చి తమలో తామే కొట్టుకుంటారని. తమకు టార్గెట్‌గా ఉన్నవారిని చంపేందుకు వాళ్లు అలా చేస్తారని రేవంత్ గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇదే సీన్ క్రియేట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇందిరాపార్క్ వద్ద సీఎం కేసీఆర్ ఏసీలు పెట్టుకుని మరీ ధర్నా చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలనుకుంటే రైతుల కళ్లాలకు వెళ్లాలని రేవంత్ సూచించారు. రేపటి నుంచి ఈనెల 23 వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్లాలలో ఉద్యమం చేస్తుందని తెలిపారు.

ధాన్యం కొనేందుకు ఈనెల 23 వరకు కేసీఆర్‌కు సమయం ఇస్తున్నామని, అప్పటికి కూడా ఈ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రైతు సమస్యలపై మోదీని నిలదీయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments