Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టార్ హోటళ్ళలో కూర్చొని రైతులపై సెటైర్లు వేస్తారా? సుప్రీంకోర్టు ఫైర్

స్టార్ హోటళ్ళలో కూర్చొని రైతులపై సెటైర్లు వేస్తారా? సుప్రీంకోర్టు ఫైర్
, బుధవారం, 17 నవంబరు 2021 (16:41 IST)
రైతులను ఉద్దేసించి పలువురు రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టార్ హోటళ్ళలో కూర్చొని రైతులపై సెటైర్లు వేస్తారా అంటూ మండిపడింది. పైగా, ఢిల్లీ కాలుష్యానికి రైతులను బాధ్యులను చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యానికి రైతులు ఎలా కారణమో చెప్పాలంటూ మండిపడింది. 
 
'కొందరు ఢిల్లీలోని ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో కూర్చొని కాలుష్యానికి కారణం రైతులేనంటూ అభాండాలు వేస్తున్నారు. అసలు వారికున్న భూమితో రైతులకొచ్చే ఆదాయం ఎంతో ఈ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్న వారికి తెలుసా?' అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మండిపడ్డారు.
 
నిషేధం ఉందని తెలిసినా బాణసంచా కాలుస్తున్నామన్న విషయాన్నే అందరూ మరచిపోయారని అసహనం వ్యక్తం చేశారు. దీపావళి అయిపోయి 10 రోజులవుతున్నా టపాసులను ఇంకా ఎందుకు అనుమతిస్తున్నారని చీఫ్ జస్టిస్ నిలదీశారు. 
 
ప్రజలకూ కొంత బాధ్యత ఉండాలన్నారు. ప్రతిదీ కోర్టు ఆదేశాలతోనే జరగడం సాధ్యం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ దీనిని ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాండాలో భారీ బాంబులు... తృటిలో తప్పించున్న బ్యాడ్మింటన్ ప్లేయర్లు