Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ - తిరుపతిల మధ్య వందే భారత్ రైలు...

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (08:49 IST)
విశాఖపట్టణం - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి మొత్తం 16 బోగీలతో కూడిన వందే భారత్ రైలు విశాఖపట్టణంకు బయలుదేరింది. ఇదే విషయంపై వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులను సంప్రదిస్తే మాత్రం.. అలాంటిదేం లేదని వారు అంటున్నారు. 
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. అయితే, ఈ రైళ్ళలో ఏదేని సాంకేతిక సమస్య తలెత్తితే ఈ రైలును రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా సాధారణ రైలును నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
తరచూ ఇలా జరుగుతుండంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో రేక్‌ను చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ రైలును విశాఖ - తిరుపతి మధ్య నడుపుతారనే ప్రచారం సాగుతోంది. దీనిపై రైల్వే శాఖ నుంచి వివరణ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments