విశాఖ - తిరుపతిల మధ్య వందే భారత్ రైలు...

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (08:49 IST)
విశాఖపట్టణం - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి మొత్తం 16 బోగీలతో కూడిన వందే భారత్ రైలు విశాఖపట్టణంకు బయలుదేరింది. ఇదే విషయంపై వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులను సంప్రదిస్తే మాత్రం.. అలాంటిదేం లేదని వారు అంటున్నారు. 
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. అయితే, ఈ రైళ్ళలో ఏదేని సాంకేతిక సమస్య తలెత్తితే ఈ రైలును రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా సాధారణ రైలును నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
తరచూ ఇలా జరుగుతుండంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో రేక్‌ను చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ రైలును విశాఖ - తిరుపతి మధ్య నడుపుతారనే ప్రచారం సాగుతోంది. దీనిపై రైల్వే శాఖ నుంచి వివరణ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments