Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాకు మరో రెండు వందే భారత్ రైళ్ళు.. ఎక్కడివరకంటే...

vande bharat
, బుధవారం, 2 ఆగస్టు 2023 (13:50 IST)
దేశంలో మరిన్ని వందే భారత్ పేరుతో నడిచే సెమీ హై స్పీడ్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ చర్యలను వేగవంతం చేసింది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక ప్రాంతాలకు వందే భారత్ రైళ్లను నడుపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖపట్టం, సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇపుడు మరో రెండు వందే భారత్ రైళ్లను నడుపనుంది. వీటిని హైదరాబాద్ - బెంగుళూరు, హైదరాబాద్ - పూణె స్టేషన్ల మధ్య నడిపే అవకాశం ఉంది. ఈ నెల 6న లేదా 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 
 
ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ కాచిగూడ - బెంగుళూరు యశ్వంత్‌పూర్ స్టేషన్ల మధ్య ఈ కొత్త వందే భారత్ రైలు పరుగులు తీయనుంది. ఇందుకోసం రైల్వే శాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ - బెంగుళూరు ప్రాంతాల మధ్య రైలు ప్రయాణం సుమారుగా 11 గంటల సమయం పడుతుంది. కానీ, వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం ఈ ప్రయాణ సమయం 8.30 గంటలకు తగ్గనుంది. అంటే.. రెండున్నర గంటల సమయం కలిసిరానుంది. 
 
ఈ కొత్త రైలు కాచిగూడ స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 3 గంటలకు బయలుదేరి, రాత్రి 11.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే, హైదరాబాద్ - పూణెల మధ్య కూడా మరో వందే భారత్ రైలును నడుపనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

TECNO SPARK 10 Pro-Magic- రంగులు మార్చుకునే స్మార్ట్ ఫోన్.. ప్రపంచంలో?