Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవిలో సరికొత్త ట్విస్ట్!!

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కమిషన్ ఛైర్మన్‌గా ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ డీజీపీ గౌతం సవాంగ్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ, ఐపీఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టవచ్చా అనే సందేహం ఇపుడు ఉత్పన్నమైంది. ఈ అంశంపై ఇపుడు ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
 
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర డీజీపీగా గౌతం సవాంగ్‌ను నియమించారు. అప్పటి నుంచి ఆయన విధులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ సక్సెస్‌తో సీఎం జగన్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డీజీపీని బదిలీ చేయడమేకాకుండా సాధారణ పరిపాలనా విభాగం (జీడీఏ)లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఏపీ సీఎం జగన్‌కు కుడిభుజంగా ఉన్న గౌతం సవాంగ్‌ను అవమానకరరీతిలో పంపించారనే ప్రచారం జరిగింది. ఈ విమర్శల నుంచి బయటపడేందుకు గౌతం సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. అయితే, ఒక ఐపీఎస్ అధికారి రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టవచ్చా అనే చర్చ ఇపుడు తెరపైకి వచ్చింది. ఒక వేళ ఈ ఛైర్మన్ పదవిని స్వీకరిస్తే డీమ్డ్ టూ హేవ్ రిజైన్డ్ అంటూ మరో వాదన తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అందుకే గౌతం సవాంగ్ నియామకంలో ఎలాటి న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments