Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైకు వెళ్ళనున్న సీఎం కేసీఆర్ - ఆదివారం ఉద్ధవ్‌తో లంచ్ మీటింగ్

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:27 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 20వ తేదీన ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై సాగిస్తున్న పోరాటంలో భాగంగా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమై లంచ్ మీటింగ్ జరుపుతారు.
 
ప్రధాని మోడీ, ఎన్డీయే సర్కారుపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన జాతీయ స్థాయి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇందులోభాగంగా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులతో ఆయన ఫోనులో మాట్లాడారు. మాజీ ప్రధాని దేవెగౌడతోను ఫోనులో మాట్లాడారు. ఇపుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కావాలని నిర్ణయించారు. 
 
అయితే, ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ముంబైకు వెళ్ళనున్నారు. గత బుధవారం సీఎం కేసీఆర్‌కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసి.. బీజేపీపై సాగిస్తున్న పోరులో తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. "కేసీఆర్ జీ... మీ పోరాటం స్ఫూర్తిదాయకం. విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ఇదే సరైన సమయం" అని ఈ సందర్భంగా ఠాక్రే వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments