Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ... విడుదల చేసిన ప్రభుత్వం

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (08:58 IST)
రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం కొత్త  ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇకపై మద్యం షాపులను నిర్వహించనుంది. ఈ ఏడాదికి 3 వేల 500 దుకాణాలను ప్రభుత్వం  నిర్వహించనుంది. మండలాలు, మున్సిపాల్టీలు,కార్పొరేషన్ల లో షాపుల ప్రదేశాలను  బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ గుర్తించనున్నారు.

150 నుంచి 300 చ.అడుగుల విస్తీర్ణంలో ఒక్కో మద్యం షాపు నిర్వహించనున్నారు. ప్రతి షాపుకు తెలుగు,ఇంగ్లీషుల్లో నెంబర్ బోర్డులు బేవరేజెస్ కార్పొరేషన్ వేయించనుంది. ప్రతి మద్యం దుకాణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో షాపుల ఎంపికకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఒక్కో షాపునకు పట్టణ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సిబ్బందిని నియమించనున్నారు. డిగ్రీ అర్హతతో సూపర్ వైజర్ కు 17 వేల 500 జీతం, ఇంటర్ అర్హతతో సేల్స్ మెన్ లకు 15 వేల జీతంతో నియమించనున్నారు.

పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల నియామకం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ షాపులను నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments