కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బండారాన్ని బయటపెడతా : వైకాపా ఎంపీ ఆదాల

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (16:40 IST)
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బండారాన్ని త్వరలోనే బయటపెడతానని నెల్లూరు వైకాపా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైకాపా అధిష్టానంపై తిరుగుబాటు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు ఎంపీ ఆదాల గట్టిగా కౌంటరిచ్చారు. ఇదే అంశంపై మాట్లాడుతూ, ప్రతి రోజూ ప్రెస్మీట్లు పెట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. 
 
ఎమ్మెల్యేగా గత మూడున్నరేళ్లలో ఎన్నో అరాచకాలు చేశారని ఆయన ఆరోపించారు. కోటంరెడ్డి అసలు స్వరూపాన్ని త్వరలోనే ప్రజల ముందు బయటపెడతానని చెప్పారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే తనకే ఐదు వేల ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. పైగా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేది తానేనని ఆయన స్పష్టం చేశారు. 
 
మరోవైపు, కోటంరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా స్పందించారు. వైకాపా ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కాలేదని కోటంరెడ్డి స్నేహితుడు శివారెడ్డి చెబుతున్నారని, అయినా ప్రభుత్వంపై కోటంరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆడియో రికార్డ్‌ను ఫోన్ ట్యాప్ అంటున్నారని విమర్శించారు. 
 
అది ఫోన్ ట్యాప్ కాదని, చంద్రబాబు ట్రాప్ అని మంత్రి కాకాణి అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ఎల్లో మీడియా కూడా వంతపాత పాట పాడుతూ విస్తృతంగా ప్రచారం చేస్తుందన్నారు. వాపును చూసుకుని బలుపు అని అనుకుంటున్నారని, రాష్ట్ర యావత్ ప్రజానీకం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని మంత్రి కాకాణి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments