Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు పాలెం సెంటరులో నిప్పంటించుకున్న సుబ్బులు...

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (09:49 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో మహిళతోపాటు కుమార్తె మరణించారు. ఈ సంఘటన ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సెంటర్ వద్ద జరిగింది. 
 
శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు పట్టణానికి చెందిన సుబ్బులు అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి తాను కూడా నిప్పు పెట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. 
 
ఈ సంఘటనలో తల్లి సుబ్బులు (27), కుమార్తె మధురవాణి (5) పూర్తిగా కాలిపోయి మృతిచెందారు. అయితే.. నిప్పు పెట్టుకోవడాన్ని చూసిన కుమారుడు మహేష్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అనంతరం అక్కడ ఉన్న స్థానికులకు ఈ విషయం చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
 
కాగా ఆ మహిళ ఇద్దరు పిల్లలతో తెల్లవారుజామున 4 గంటలకు బళ్లారి నుంచి వచ్చిన బస్సులో నెల్లూరు పాలెం సెంటర్లో దిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కుమారుడు మహేష్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments