Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు పాలెం సెంటరులో నిప్పంటించుకున్న సుబ్బులు...

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (09:49 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో మహిళతోపాటు కుమార్తె మరణించారు. ఈ సంఘటన ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సెంటర్ వద్ద జరిగింది. 
 
శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు పట్టణానికి చెందిన సుబ్బులు అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి తాను కూడా నిప్పు పెట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. 
 
ఈ సంఘటనలో తల్లి సుబ్బులు (27), కుమార్తె మధురవాణి (5) పూర్తిగా కాలిపోయి మృతిచెందారు. అయితే.. నిప్పు పెట్టుకోవడాన్ని చూసిన కుమారుడు మహేష్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అనంతరం అక్కడ ఉన్న స్థానికులకు ఈ విషయం చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
 
కాగా ఆ మహిళ ఇద్దరు పిల్లలతో తెల్లవారుజామున 4 గంటలకు బళ్లారి నుంచి వచ్చిన బస్సులో నెల్లూరు పాలెం సెంటర్లో దిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కుమారుడు మహేష్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments