Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో అర్థరాత్రి పోలీసు జులం : 4వ డివిజన్ అభ్యర్థి పీఎస్‌కు తరలింపు

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (09:57 IST)
అధికార వైకాపా పార్టీ అండతో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తాము చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నెల్లూరులో ఆదివారం జరుగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో 4వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త.. మామిడాల మధును అర్థరాత్రి అదుపులోకి తీసుకున్న నవాబుపేట పోలీసులు పీఎస్‌కు తరలించారు. 
 
అతని జేబులో రూ.2వేలు ఉన్నాయనే సాకుతో అక్రమంగా నిర్బంధించారని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న తెదేపా నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్టేషన్‌కు చేరుకున్నారు. 
 
అర్థరాత్రి నుంచి ఆయన స్టేషన్‌ ఆవరణలో బైఠాయించారు. మధును విడుదల చేయకపోవడంతో కోటంరెడ్డి నిరసన కొనసాగుతోంది. 4వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి విజయం ఖాయం కావడంతో మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ప్రోద్బలంతోనే పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments