Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్ళలో ప్రత్యేక అదనపు బాదుడు ఆదివారం నుంచే..

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (09:46 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారికి ముందున్న విధానంలోనే రైళ్లను నడుపుతామని, పాత ఛార్జీలే వసూలు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. కానీ, ప్రయాణికులకు పూర్తిస్థాయిలో ప్రయోజనాల్ని అందించడంలో పూర్తిగా విఫలమైంది. రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని శుక్రవారం రైల్వే శాఖ ప్రకటించింది. అయితే, ‘ప్రత్యేక’ రైళ్ల పేరుతో అదనపు బాదుడుకు శనివారం అర్థరాత్రి (ఆదివారం) నుంచి మాత్రమే స్వస్తి పలికింది. 
 
అదేసమయంలో వయోవృద్ధులు సహా పలురకాల వారికి ఇచ్చే రాయితీల్ని దక్షిణ మధ్య రైల్వే సహా పలు జోన్లు ఇంకా పునరుద్ధరించలేదు. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం ప్రయాణానికి 75 ఏళ్ల వ్యక్తికి టికెట్‌కు ప్రయత్నం చేస్తే సీనియర్‌ సిటిజన్‌ కన్సెషన్‌ రాయితీ లేకుండా పూర్తి ఛార్జీ చూపిస్తోంది. 
 
రానున్న రోజుల్లో ప్రయాణానికి టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు ఛార్జీలను తిరిగి చెల్లిస్తారా? లేదా? అన్న విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. ప్రయాణ దూరం, తరగతి, రైలుని బట్టి ఒక్కో టికెట్‌పై రూ.75-100 నుంచి దురంతో వంటి రైళ్లలో రూ.350-400 వరకు అదనంగా వసూలుచేశారు. 14వ తేదీ నుంచి రెగ్యులర్‌ రైళ్లుగానే నడపనున్న నేపథ్యంలో.. అదనంగా వసూలుచేసిన ఛార్జీలను తిరిగి ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments