Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా నిర్మిస్తున్న ఇల్లు.. 4 రోజులు.. 9 అడుగుల లోతు.. నరబలి.. ఎక్కడ?

నెల్లూరు జిల్లాలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. 15 రోజుల క్రితం కందుకూరు నుంచి ఓ అర్థరాత్రి ఓ వ్యక్తిని తీసుకొచ్చి పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే,

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (16:31 IST)
నెల్లూరు జిల్లాలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. 15 రోజుల క్రితం కందుకూరు నుంచి ఓ అర్థరాత్రి ఓ వ్యక్తిని తీసుకొచ్చి పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, కలిగిరి మండలం తూర్పుదూబగుంట ఎస్సీ కాలనీకి చెందిన చదలవాడ మాల్యాద్రి కుటుంబం అర్థరాత్రి పూట పూజలు చేసి నరబలి ఇచ్చినట్లు స్థానికులు ఫిర్యాదులో తెలిపారు.
 
కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో ఈ తాంత్రిక పూజలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు తొమ్మిది అడుగుల లోతు గుంత తీసి ఈ పూజలు జరిపారని.. మళ్లీ గుంతను పూడ్చినట్లు గ్రామస్తులు ఫిర్యాదులో తెలిపారు. 
 
కానీ మాల్యాద్రి కుటుంబ సభ్యులు మాత్రం కుటుంబపెద్దకి అనారోగ్యంగా వుండటం వల్ల కాటికాపరి సూచనల మేరకు ఇంట్లో తొమ్మిది అడుగుల లోతు తీసి పూజలు జరిపి దానిలో గుమ్మడికాయను పూడ్చి పెట్టామని చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మాల్యాద్రి ఇంట్లో పూడ్చిన తొమ్మిది అడుగుల గుంతను తవ్వి పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments