Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక రాధ ఇద్దరు కృష్ణులు... తాగిన మత్తులో టెన్త్‌ అబ్బాయిలు ఏం చేశారో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు యువకులు తాగిన మైకంలో ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకుని సజీవదహనమయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

ఒక రాధ ఇద్దరు కృష్ణులు... తాగిన మత్తులో టెన్త్‌ అబ్బాయిలు ఏం చేశారో తెలుసా?
, సోమవారం, 1 అక్టోబరు 2018 (13:20 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు యువకులు తాగిన మైకంలో ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకుని సజీవదహనమయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జగిత్యాల జిల్లా కేంద్రం విజయపురి కాలనీలో నివసిస్తున్న కూసరి మహేందర్‌, విద్యానగర్‌లో కుందారపు రవితేజ స్నేహితులు. ఇద్దరూ విద్యానగర్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. మహేందర్‌ ఓసారి ఇల్లు వదిలి హైదరాబాద్‌కు పారిపోయాడు. రవితేజ మత్తు కోసం వుడ్‌ ప్రైమర్‌ను అలవాటు చేసుకోవడంతో తల్లిదండ్రులు అతడికి పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించారు.
 
ఈ క్రమంలో ఓ అమ్మాయిని మహేందర్‌, రవితేజలు ప్రేమించారు. ఈ ప్రేమ విషయంపై వారిద్దరూ పలుమార్లు గొడవకూడా పడ్డారు. ఈ క్రమంలో ఆదివారం మహేందర్‌, రవితేజ మరో స్నేహితుడితో కలిసి పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌లో మద్యం సేవించారు. తాగిన మైకంలో ఇద్దరూ గొడవ పడినట్లు సమాచారం. అది ముదరడంతో ఒకరిపైన మరొకరు పెట్రోలు చల్లుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం వారి స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో చిక్కుకుని మహేందర్‌ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచాడు. 
 
రవితేజను జగిత్యాల ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలురిద్దరూ ఒకరిపై మరొకరు పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నారా? ఈ ఘటనలో ఎవరైనా మూడో వ్యక్తి ప్రమేయం ఉందా? లేదంటే.. అమ్మాయిని వేధిస్తున్నారంటూ మరెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ కోణాల్లోనే దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

4 నెలల బిడ్డతో పరీక్ష.. గుక్కపెట్టి ఏడ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే?