Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

ఠాగూర్
మంగళవారం, 10 జూన్ 2025 (16:29 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతీ రెడ్డిలకు చెందిన సాక్షి టీవీ చానెల్ చర్చా వేదికలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస రావు, కృష్ణంరాజులు చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 
 
రాజధాని అమరావతి కోసం చేసిన ఉద్యమంలో మహిళా రైతులది అత్యంత కీలక పాత్ర అని జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. అలాగే, ఈ వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసి, డీజీపీకి లేఖ రాసింది. ఈ మేరకు ఎన్.సి.డబ్ల్యూ చైర్ పర్సన్ విజయ్ రహత్కర్ రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలకు ఓ లేఖ రాశారు. 
 
అమరావతి ప్రాంతంలో ఉద్యమిస్తున్న మహిళలపై జర్నలిస్టులు కృష్ణంరాజులు, కొమ్మినేని శ్రీనివాస రావులు అనుచితంగా మాట్లాడారంటూ వచ్చిన ఆరోపణలను కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు ముందుండి కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా కమిషన్ గుర్తు చేసింది. 
 
ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి వివిధ మీడియాల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని ఎన్.సి.డబ్ల్యూ ఈ అంశాన్ని సుమోటాగా విచారణకు స్వీకరించినట్టు సమాచారం. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీశ్ గుప్తాను మహిళా కమిషన్ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments