Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖనగరంలో డ్రగ్స్ ఇంజెక్షన్ల కలకలం..

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (12:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక తీర ప్రాంతంగా ఉన్న విశాఖ నగరంలో డ్రగ్స్ ఇంజెక్షన్లు కలకలం సృష్టించాయి. చిత్తుకాగితాల వ్యాపారం పేరుతో మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తిని దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఆటోనగర్‌ సమీపంలోని యాదవ జగ్గరాజుపేటలో స్క్రాప్‌ వ్యాపారం చేస్తున్న మహేశ్వర్‌రెడ్డిగా గుర్తించారు. ఈయన మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. 
 
ఇదే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆటోనగర్‌ యాదవ జగ్గరాజుపేట సమీపంలోని అపెరల్‌ పార్క్‌ రోడ్డులోని ఓ స్క్రాప్‌ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా 35 మత్తు ఇంజెక్షన్లు, గంజాయి నింపిన సిగరెట్లు, కొంత గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనికి సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోల్‌కతా నుంచి ఇంజెక్షన్లు తెప్పించి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పూర్తి విచారణ చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments