ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం రైళ్లను ఆపివేశారు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (11:59 IST)
సాధారణంగా రైళ్లు వెళుతుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా దారి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం లెవల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు మూసివేసి వాహనాల రాకపోకలను నిలిపివేస్తుంటారు. అయితే, బిహార్ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరిగింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఏకంగా రైళ్లనే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలాసేవు రెడ్ సిగ్నల్ ఉండటంతో అనేక మంది ప్రయాణికులు రైలు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో సీఎం నితీశ్ కుమార్ సమాధాన్ యాత్రను చేస్తున్నారు. ఇందులోభాగంగా, రైలు పట్టాలను ముఖ్యమంత్రి కాన్వాయ్ దాటాల్సివుంది. ఇందుకోసం రైళ్లను ఏకంగా 15 నిమిషాల పాటు నిలిపివేశారు. బక్సర్ రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్ వద్ద రెండు రైళ్లు నిలిచిపోయాయి. సీఎం వెళ్లిపోయిన తర్వాత వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటికే విసుగెత్తిన ప్రయాణికులు కొందరు రైలు దిగి పట్టాల వెంబడి నడుచుకుంటూ బక్సర్ రైల్వే స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లారు. ఈ చర్యను కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేపట్టింది సమాధాన్ యాత్ర కాదని విఘాత యాత్ర అని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం