Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం నిర్ణయంపై నరసరావుపేట ఎంపీ లావు హర్షం

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (20:14 IST)
ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నా యోజన పథకాన్ని మరో 4 నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర కేబినేట్‌ తీసుకున్న నిర్ణయంపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. 
 
 
లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్నప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు దశలుగా నిర్వహిస్తున్నఈ పథకం నవంబర్‌ 30, 2021 నాటికి ముగుస్తుంది. అయితే, పేద‌ల ప‌రిస్థితుల‌ను అర్ధం చేసుకుని  ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నా యోజన పథకం గడువును  మార్చి 2022 వరకు పొడిగించినందుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు  ఆనందం వ్యక్తం చేశారు.
 
 
ఈ పథకాన్ని 6 నెలలు పొడిగించాలని కోరుతూ సోమవారం దేశ ప్రధానికి ఎంపీగా తాను లేఖ రాసినట్లు లావు  శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి కేంద్ర కేబినేట్‌ ఐదవ దశ నిర్వహణకు రూ.53,344 కోట్లు కేటాయింపులు చేసినందున ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఎంతో మంది దేశ ప్రజానీకానికి ఆహార భద్రత కల్పిస్తుందని అన్నారు. కోవిడ్ వ‌ల్ల గ‌త రెండేళ్ళుగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నార‌ని, ముఖ్యంగా ఆర్ధిక వ్య‌వ‌స్థ ఇంకా అస్త‌వ్య‌స్తంగానే ఉంద‌ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభిప్రాయ‌పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments