కేంద్రం నిర్ణయంపై నరసరావుపేట ఎంపీ లావు హర్షం

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (20:14 IST)
ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నా యోజన పథకాన్ని మరో 4 నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర కేబినేట్‌ తీసుకున్న నిర్ణయంపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. 
 
 
లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్నప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు దశలుగా నిర్వహిస్తున్నఈ పథకం నవంబర్‌ 30, 2021 నాటికి ముగుస్తుంది. అయితే, పేద‌ల ప‌రిస్థితుల‌ను అర్ధం చేసుకుని  ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నా యోజన పథకం గడువును  మార్చి 2022 వరకు పొడిగించినందుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు  ఆనందం వ్యక్తం చేశారు.
 
 
ఈ పథకాన్ని 6 నెలలు పొడిగించాలని కోరుతూ సోమవారం దేశ ప్రధానికి ఎంపీగా తాను లేఖ రాసినట్లు లావు  శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి కేంద్ర కేబినేట్‌ ఐదవ దశ నిర్వహణకు రూ.53,344 కోట్లు కేటాయింపులు చేసినందున ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఎంతో మంది దేశ ప్రజానీకానికి ఆహార భద్రత కల్పిస్తుందని అన్నారు. కోవిడ్ వ‌ల్ల గ‌త రెండేళ్ళుగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నార‌ని, ముఖ్యంగా ఆర్ధిక వ్య‌వ‌స్థ ఇంకా అస్త‌వ్య‌స్తంగానే ఉంద‌ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభిప్రాయ‌పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments