Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్రపూజల కోసం నరబలి ఇచ్చారా..? అనంతలో కలకలం

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (21:53 IST)
అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. ఏపీలో మదనపల్లె తరహాలో అనంతపురంలో నరబలి ఇచ్చారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. బమ్మనహాల్‌ మండలం హెచ్‌ఎల్‌సి కాలువ వద్ద బుధవారం ఓ యువకుడిని క్షుద్రపూజలు చేసి హత్య చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఉంతకల్లు గ్రామ సమీపంలోని హెచ్‌ఎల్‌సి కాలువ గట్టుపై గుర్తు తెలియని 24 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. 
 
ఎస్‌ఐ బాషా తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడు మృతి చెందిన ప్రాంతంలో నిమ్మకాయలు, కుంకుమ, పసుపుతో వేసిన ముగ్గు, ఆకులు తదితర వాటిని గుర్తించారు. క్షుద్రపూజల అనంతరం యువకుడిని నరబలి ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన వ్యక్తి బళ్లారి ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. 
 
హత్య జరిగిన ప్రాంతంలో ఆనవాళ్లను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. క్షుద్రపూజల కోసమే యువకుడిని హత్య చేశారా..? లేక ఇతర కారణాలతో చంపి అనుమానం రాకుండా నిందితులు ఇలా చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments