Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్న దళితుడు (వీడియో)

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:49 IST)
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుడి కట్టి.. ఆయన తనయుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీకి ఓటు వేసినందుకు ఓ దళితుడు తన చెప్పుతో తానే కొట్టుకుంటున్నాడు. దీనికి సంబంధిచిన వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాలనపై నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "జగన్ గారూ, మీ మాటలకు, చేతలకు ఆకాశానికి, భూమికి మధ్య ఉన్నంత దూరం ఉంది. మీరు అసెంబ్లీలో ఎస్సీ కార్పొరేషన్ బిల్ ప్రవేశపెట్టిన రోజే, మీ నాన్నగారికి గుడికట్టి, మీకు మద్దతిచ్చిన ఓ దళితుడికి ఎంతటి దుస్థితి పట్టిందో చూడండి" అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. 
 
తన నియోజకవర్గంలో పార్టీ కన్వీనర్ తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నాడని, పార్టీ నుంచి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ దళితుడు బూటుతో తనను తాను కొట్టుకోవడం ఆ వీడియోలో కనిపించింది.
 
మీ పార్టీకి మద్దతిచ్చినందుకు ఓ వ్యక్తి తనను తాను చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్న లోకేశ్, దీన్నిబట్టే మీ పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. దళితులపై వైసీపీ నాయకులు అకృత్యాలకు ఇదొక ఉదాహరణ వైఎస్ జగన్ గారూ అంటే లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొంటూ ఆ వీడియోను షేర్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments