Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బాబాతో చాలా డేంజర్.. మంత్రి అచ్చెన్నాయుడు

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై ఆయన స్పందిస్తూ... జగన్ బాబాతో చాలా డేంజర్ అని నంద్యాల ఓటర్లు నిరూపించారని ఆయన వ్యాఖ్యానిం

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (13:57 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై ఆయన స్పందిస్తూ... జగన్ బాబాతో చాలా డేంజర్ అని నంద్యాల ఓటర్లు నిరూపించారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం వెల్లడైన నంద్యాల ఉప ఎన్నిక ఫలితంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 
 
దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు కులమతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారన్నారు. అందుకే నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లు ఏకపక్షంగా తీర్పునిచ్చారన్నారు. 
 
దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఇంతవరకు చూడని విధంగా ఒక ఉప ఎన్నిక ప్రచారం కోసం విపక్ష నేత, వైకాపా అధినేత జగన్ ఏకంగా 15 రోజుల పాటు నంద్యాలలో తిష్టవేసి, ప్రతి ఇంటింటికి వెళ్లివెళ్లి ఓట్లు వేయమని ప్రాధేయపడినా ఓటర్లు చాలా తెలివిగా, విజ్ఞతతో తీర్పునిచ్చారన్నారు. ఈ తీర్పుద్వారా జగన్ బాబాతో చాలా డేంజర్ అని నంద్యాల ఓటర్లు తేల్చారని అచ్చెన్నాయుడు కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments