Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా భేటీ

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (16:02 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజా సోమవారం సమావేశమ్యారు. చెన్నైలోని సచివాలయంలో తన భర్త ఆర్కే. సెల్వమణితో కలిసి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ బొమ్మతో తయారు చేసిన శాలువాను బహుకరించారు. ఆ తర్వాత పలు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు. 
 
ముఖ్యంగా, నగరితో పాటు చిత్తూరు జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు తమిళ పాఠపుస్తకాలు అందజేయాలని కోరారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో తరగతి వరకు వెయ్యి పుస్తకాలు చొప్పున మంజూరు చేయాలని కోరారు. 
 
అలాగే ఏపీ ఇండస్ట్రియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా సుమారు 5800 ఎరకాల విస్తీర్ణంలో చేపడుతున్న కొసలనగరం పారిశ్రామికవాడకు తమిళనాడు నుంచి పరిశ్రమలు రావడానికి భారీ వాహనాల రాకపోకలకు అనువుగా నేడుంబరం - అరక్కోణం రోడ్డు ఎన్.హెచ్.716 నుంచి ఇండస్ట్రియల్ పార్కు చేరడానికి అప్రోచ్ రోడ్లు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. 
 
అలాగే, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె వినతి పత్రం సమర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments